KKD: తన రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్యే, మంత్రి, స్పీకర్ వంటి ఉన్నత పదవులు అడగకుండానే తనను వరించాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తుని టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గత 44ఏళ్లుగా పార్టీ తనకు సముచిత గౌరవం ఇచ్చిందన్నారు. యువ నాయకత్వానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నానన్నారు