TPT: రాష్ట్ర గవర్నర్ ఈనెల 30, 31 తేదీలలో తిరుపతి పర్యటనకు రానున్నారని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.