ప్రకాశం: పెద్దారవీడు మండలం మద్దలకట్ట జాతీయ రహదారిపై విషాదం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు.