SDPT: రాయపోల్ మండలం వడ్లపల్లిలో గ్రామదేవత పోచమ్మకు భక్తులు బోనాలను సమర్పించారు. సంప్రదాయబద్ధంగా మహిళలు తలపై బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని, డప్పుల వాయిద్యాలతో సందడి చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.