SRPT: లారీ యజమానులపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ పోకడలను నిరసిస్తూ, రాష్ట్ర లారీ ఓనర్ల అసోసియేషన్ కోదాడలో శనివారం నిరసన తెలిపింది. రేడియం స్టిక్కర్ల పేరిట వేల రూపాయలు వసూలు చేయడం అన్యాయమని అసోసియేషన్ ప్రతినిధులు మండిపడ్డారు. ఈ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని,లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు.