ప్రకాశం: కొండేపి నియోజక వర్గ స్థాయి ఏఐటీయూసీ (AITUC) ద్వితీయ మహాసభలు టంగుటూరులోని సౌత్ బీసీ కాలనీలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలో నియోజక వర్గంలోని కార్మికుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏఐటీయూసీ కొండేపి నియోజవర్గ (AITUC) అధ్యక్షులుగా జాకీర్, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ రావు, కోశాధికారిగా ప్రసాదరావులును ఎన్నుకున్నారు.