NDL: బండి ఆత్మకూరు మండలం కడమలకాల్వ శ్రీ శివ నందీశ్వర స్వామి దేవస్థానంలో శాశ్వత హుండీని శనివారం లెక్కించారు. నంద్యాల డివిజన్ తనిఖీ అధికారి పీ. హరిచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. ఏడాది కాలానికి రూ. 39,288 ఆదాయం వచ్చినట్లు ఈవో నాగప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ మద్దిగారి పుష్పరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.