HNK: శాయంపేట మండలం మైలారం గ్రామం నుండి జోగంపల్లి గ్రామానికి వెళ్లే రహదారిలో విద్యుత్ తీగలు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. మిషన్ భగీరథ పంప్ హౌస్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు ఒరగడంతో తీగలు కిందికి వేలాడుతున్నాయి. దీంతో ఆ దారిలో వెళ్లే ప్రయాణికులు, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు సమస్యను పరిష్కరించాలన్నారు.