NLG: చిట్యాల మండలం ఏపూరులోని అంగన్వాడీ కేంద్రాలకు ఎస్బీఐ పాన్ ఇండియా సీఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా ప్రీస్కూల్ మెటీరియల్ను శనివారం పంపిణీ చేశారు. మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ ఛైర్మన్ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో ఎల్ఈడీ టీవీ, రైస్ కుక్కర్, ఆటవస్తువులు, పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ క్రాంతి కుమార్, సర్పంచ్ మహేష్ పాల్గొన్నారు.