NLG: గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలో సీట్లు సాధించిన మైనంపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సాత్విక్, వర్షిత, హన్వీక్లను గ్రామ సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ నేడు ఘనంగా సన్మానించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మికి కూడా ప్రత్యేక గౌరవం లభించింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.