HYD: బాధ్యతగల జర్నలిస్టులకు అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ ప్రభుత్వ కార్డులు అందుతాయని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు అక్రిడిటేషన్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.