MLG: మంగపేట మండల కేంద్రంలో ఇవాళ మన్య సీమ పరిరక్షణ సమితి మండల అధ్యక్షుడు నాగరాజ్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ప్రతినిధులు ఆదివాసీ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ సంఘంపై విమర్శలు చేయడం తగదని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహం వివాదంపై చేస్తున్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.