అన్నమయ్య: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు చూపిన ధర్మ మార్గాన్ని అనుసరించాలని సూచిస్తూ, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలని సూచించారు.