సత్యసాయి: నల్లమాడ మండలం కొండ్రువారిపల్లికి చెందిన మీనాక్షి(19) అదృశ్యంపై నమోదైన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ విజయ్ కుమార్, సీఐ శ్రీనివాస్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. సంతకు వెళ్లి తిరిగి రాని యువతి ఆచూకీని పోలీసులు చాకచక్యంగా గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.