VSP: ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి. అప్పలనాయుడు ద్వారకా బస్ స్టేషన్ను తనిఖీ చేశారు. బస్ స్టేషన్ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని, ప్రయాణికులకు టాయిలెట్, మంచినీటి సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. అలాగే, ఆహ్లాదకర వాతావరణం కోసం ఫిష్ అక్వేరియంను కూడా ఆధునీకరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.