MBNR: జడ్చర్ల నియోజకవర్గంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి అవసరమైన కొత్త బస్ రూట్లను, బస్ స్టాపులను మంజూరు చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. అలాగే ఇప్పటికే ఉన్న బస్టాండ్లను ఆధునీకరించి ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపర్చాలని విన్నవించారు. ఈ మేరకు అసెంబ్లీ హల్లో మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు.