ప్రకాశం: ఒంగోలులోని ప్రకాశం భవన్లో జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారిని గురువారం సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్.విజయకుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గల గుండ్లకమ్మ ప్రాజెక్టు పునరావాస కేంద్రాల అభివృద్ధి గురించి జేసీతో చర్చించారు. అలాగే పలు రెవిన్యూ సమస్యలను జేసీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.