SRPT: కోదాడ పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని కోదాడ మండల విద్యాధికారి ఎండీ సలీం షరీఫ్ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలను పెంచడం కోసం ముందస్తుగా ‘బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.