VSP: వేపగుంటలో వుడా, దేవస్థానం భూ సమస్య ఎదుర్కొంటున్న రైతులతో ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు ఇవాళ సమావేశమవుతారు. ఉదయం 9 గంటలకు వేపగుంటలో వినాయకుడి గుడి వెనుక ఉన్న జీవీఎంసీ సామాజిక భవనంలో ఈ సమావేశం జరుగుతుంది. రైతులంతా పాల్గొని తమ సమస్యను ఎమ్మెల్యేకు వివరించుకోవాలని మాజీ కార్పొరేటర్ బల్ల శ్రీనువాసరావు తెలిపారు.