SRPT: నూతనకల్ మండలం చిల్పకుంట్లలోని మిషన్ భగీరథ 20 ఎంఎల్డీ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లు తమ వేతనాలను చెల్లించాలని బుధవారం కలెక్టర్కు ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఐదు నెలలుగా పెండింగ్ వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్, హరికృష్ణలు అన్నారు.