WGL: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నేడు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు, వినతిపత్రాలను నేరుగా అధికారులకు అందజేయవచ్చని ఆమె పేర్కొన్నారు.