SKLM: పలాసలోని యూటీఎఫ్ నాయకులు మంగళవారం రణభేరి నిరాహార దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. కిషోర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు చేయాలని, మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఐఆర్ 29% వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.