E.G: గోపాలపురం వైసీపీ ఇంఛార్జ్, మాజీ హోంమంత్రి తానేటి వనిత మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలను ఆమె జగన్కు వివరించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.