MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనంలో నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీ.ఎడ్ పరీక్ష ఫలితాలను ఉపకులపతి ప్రొఫెసర్ శ్రీనివాస్ ఇవాళ విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాల కోసం యూనివర్సిటీ వెబ్ సైట్లో సందర్శించాలన్నారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ కే.ప్రవీణ, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.