గతేడాది RCB విజయోత్సవ పరేడ్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ మృతులకు నివాళులర్పించేందుకు బెంగళూరు జట్టు ఒక భావోద్వేగ నిర్ణయం తీసుకుంది. ఇకపై చిన్నస్వామి స్టేడియంలో జరిగే ప్రతి మ్యాచ్లోనూ 11 సీట్లను ఖాళీగా ఉంచి వారికి అంకితం చేయనున్నారు. ఆ సీట్లను ఎవరికీ కేటాయించకుండా అభిమానుల జ్ఞాపకార్థం రిజర్వ్ చేస్తారు.