KDP: కమలాపురం మండలం సి.గోపాలపురం ఎంపీపీ పాఠశాలలో మంగళవారం కంటి పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులతో పాటు గ్రామ ప్రజలకు కూడా ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. కంటి సమస్యలు ఉన్నవారికి అవసరమైన మందులు అందజేశారు. త్వరలోనే అర్హులైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేస్తామని కంటి వైద్యుడు వెంకట సురేశ్ తెలిపారు.