SKLM: ఆమదాలవలసలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏపీ నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు ‘నేచర్ క్యాంప్’ నిర్వహించారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రకృతిని అర్థం చేసుకుని పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకోవాలన్నారు. బుడుమూరు, బి.కోడూరు, సింగు పురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.