MLG: మంగపేట మండలం లక్ష్మీనర్సాపురం గ్రామంలో వైభవంగా జరిగే శ్రీ నాగులమ్మ జాతర మహోత్సవాలకు రావాలని మంత్రి సీతక్కకు ఆలయ ధర్మకర్త, ప్రధాన అర్చకులు రామకృష్ణ స్వామి ఆదివారం ఆహ్వానపత్రం అందజేశారు. వనదేవతలుగా ప్రసిద్ధి చెందిన నాగులమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ మంత్రికి తెలిపారు. మంత్రి జాతరకు వస్తానని ఆలయ కమిటీకి హామీ ఇచ్చారు.