MBNR: ప్రతి ఒక్కరూ మాతృభూమికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతి కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన శిశు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గౌరవించాలని, దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.