ప్రకాశం: ఈ నెల 25న మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ముందుగా దోర్నాల మండలం గంటవానిపల్లి ఫీడర్ కెనాల్ శంకుస్థాపన, అనంతరం మార్కాపురం పట్టణంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఉమ్మడి జిల్లా కలెక్టర్ పి. రాజబాబు అధికారులతో సమీక్షించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.