కడప: ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు ఆదివారం ఎరుపెక్కాయి. భారీ ర్యాలీ అనంతరం జరిగిన సభలో రాష్ట్ర నేతలు ఎస్.వెంకటసుబ్బయ్య, చలసాని వెంకటరామారావు పాల్గొన్నారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు, లేబర్ కోడ్ల అమలుపై వారు తీవ్రంగా మండిపడ్డారు. కార్మిక హక్కులు, ఆశా-అంగన్వాడీల కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం పాలకులపై కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని కోరారు.