VZM: ఎస్. కోట శ్రీనివాస కాలనీలో ఎమ్మెల్యే లలిత కుమారి ఆదివారం పర్యటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈనెల 23న అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.