TG: అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతును ధైర్యంగా సాగుబడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తాన్నామని స్పష్టం చేశారు. రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు ఇవాళ శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. 70 లక్షల మంది రైతన్నలకు భరోసా కల్పిస్తున్నామని, తమ పాలనలో రైతే రాజని మరోసారి రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.