VZM: బొబ్బిలి రైల్వేస్టేషన్లో రైల్వే రక్షక దళం పోస్ట్ను వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్ర ప్రారంభించారు. నూతన భవనంలో ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడానికి అత్యంత సదుపాయాలతో కూడిన సీసీ కెమెరాలు, రిసెప్షన్ సెంటర్, నేరాలు అరికట్టేందుకు నిరంతరం పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఫ్ ఐజీ అలోక్ బోహ్ర, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.