TPT: సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 30న నాయుడుపేట పర్యటనకు రానున్నారు. బిరదవాడ సమీపంలోని టిడ్కో గృహ సముదాయాలను ప్రారంభించి, లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేయనున్నారు. పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, జేసీ గోవిందరావుతో కలిసి అధికారులు పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.