భారత మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డి ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ‘ఉత్తమ మహిళా క్రికెటర్’గా నిలిచింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేయడంతో ఆమె ఈ అవార్డును దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ఈ అవార్డు గెలుచుకోవడం చాలా గర్వంగా ఉందని తెలిపింది. పురుషుల విభాగంలో పాక్ ప్లేయర్ ఫర్హాన్ ఈ అవార్డును గెలుచుకున్నాడు.