NZB: బోధన్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటన మంగళవారం రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేఎంసీ కాలనీ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మందికి గాయాలు కాగా హుటాహుటిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సంఘటన స్థలాన్ని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పరిశీలించారు.