SKLM: అర్హులైన పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం CPI రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందించాలని అన్నారు.