SRPT: కాసరబాదలో జరిగిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి హాజరయ్యారు. పేదల సొంతింటి కల కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వకుండా వంచించిందని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం పేదలకు గృహవసతి కల్పిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు.