GNTR: మంగళగిరిలో లాడ్జీలు, హోటళ్లలో పోలీసులు శనివారం అకస్మిక తనిఖీలు చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో ఎస్సై వెంకట్ ఈ తనిఖీలు చేపట్టారు. గదుల కేటాయింపు, ఐడీ కార్డులు, సీసీ కెమెరాలను పరిశీలించారు. లాడ్జీల్లో పేకాట, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామన్నారు.