TG: జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంటలో విషాదం చోటు చేసుకుంది. కాబోయే వరుడి వేధింపులు తాళలేక స్నేహ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా యువతి క్యారెక్టర్పై కాబోయే వరుడు తరుచూ ఫోన్లో వేధించేవాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడు హరికృష్ణను అదుపులోకి తీసుకున్నారు.