MDK: కేజీబీవీ విద్యార్థులకు మెనూను తప్పక అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. టేక్మల్ మండల కేంద్రంలో కేజీవీబీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీవీబీ పాఠశాలలో స్టోర్ రూమును, కిచెన్, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కేజీవీబీ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెనూ తప్పక అమలు చేయాలన్నారు.