శ్రీకాకుళంలోని అభ్యుదయ డిగ్రీ కళాశాలలో మార్చి 31న రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 15 ప్రైవేట్ కంపెనీలు పాల్గొని 500పైగా ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ ఉద్యోగాలకు 18-30 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు అర్హులని పేర్కొన్నారు.