NRML: జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్యశాఖ అధికారి రాజేందర్ అన్నారు. బుధవారం టీబి రహిత తెలంగాణ, టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ పట్టణంలోని రాంనగర్ పీహెచ్ఎసీలో వారు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీబీ వ్యాధి నివారణకు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు.