సత్యసాయి: మరో ఐదు రకాల వైకల్యాలను సదరం పరిధిలోకి చేర్చినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. యాసిడ్ దాడి బాధితులు, ఆటిజం, లెర్నింగ్ డిజార్డర్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్, బహుళ వైకల్యాల వారికి డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఈ నెల 25 నుంచి స్లాట్ బుకింగ్, 30 నుంచి వైద్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.