GNTR: జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సిబ్బంది గ్రీవెన్స్లో ఎస్పీ వకుల్ జిందాల్ ఫిర్యాదులను స్వీకరించారు. సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. శాఖపరమైన చర్యలు ఎదుర్కొంటున్న వారిని విచారణ అనంతరం తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.