కృష్ణా: మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని వాసవి భవన్లో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి డా. కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో APSRTC ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య సేవలను వారు కొనియాడారు.