తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని హాథీరాంజీ మఠం మహంతు అర్జున్ దాస్ దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మహంతుగా నియమితులైన అర్జున్ దాస్కు మఠం ప్రాంగణంలో ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఎంటీవో కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ కేశవులు, లా ఆఫీసర్ లక్ష్మీ స్వాములు సనక్ దాస్, కృష్ణ దాస్, మాధవ దాస్ తదితరులు పాల్గొన్నారు.