చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి 179వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చిత్తూరు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.