MNCL: బెల్లంపల్లి పట్టణంలో గురువారం శ్రీ పరాభావ ఉగాది పండుగను పురస్కరించుకుని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో బెల్లంపల్లి మున్సిపల్ ఛైర్మెన్ దావ స్వాతి-రమేష్ ప్రజలకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.